తుమ్మల నాగేశ్వరరావు గారి కి
బుధవారం స్టేట్ హోం నుండి 11 మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోయిన విషయం లో మీరు అధికారులని మందలించారు..బానే ఉంది కానీ అసలక్కడ ఏం జరుగుతోంది అనేది నాకు తెలిసినంతవరకు చెప్తాను.'స్టేట్ హోం లో అప్పుడే పుట్టిన పసిపిల్లల్ల దగ్గరనుండి 25 యేళ్ళ లోపు వాళ్లున్నారు .
అక్కడ పిల్లల్లో.. తల్లీతండ్రీలేనివాళ్ళే కాకుండా semi orphans అంటే పేరెంట్స్ లో ఎవరో ఒకరు ఉండీ పోషించలేని పరిస్థిలో ఉన్న పిల్లలు+అనాధాశ్రమం+రెస్క్యూ హోం కూడా ఉండటం తో కొద్దిగా పిల్లల మైండ్ సెట్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సహజం గా 10 యేళ్ళు దాటిన పిల్లలకి తల్లో, తండ్రో అప్పుడప్పుడూ వచ్చి కనపడుతుండటంతో ఇంటికెళిపోవాలనే కోరిక పెరగడం,వాళ్ళతోపాటు అసలు పేరెంట్స్ లేని పిల్లలు కూడా వాళ్ళ మధ్య ఉన్న స్నేహం తో వీళ్ళు వెళిపోవడం జరుగుతోంది.
ఇదికాకుండా అక్కడ నీళ్ళు పట్టుకోవడం దగ్గరనుండి చాలాపనులు వీళ్ళే చేసుకుంటూ ఉంటారు..ఇదే పని బయట చేసుకుని బతకలేమా అనే ఆలోచన కూడా వీళ్లకి ఉంది..అయితే వీళ్ళలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నవాళ్ళు ఉన్నారు..
ఒకమాట చెప్పండి నిజంగా ఈరోజుల్లో చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువుతోపాటు ఇంటిపనులు చేసుకునే టైం ఉంటోందా ఇప్పుడున్న చదువులకి.
ఇక రెస్క్యూ హోం కూడా ఇక్కడే ఎందుకు ఉండటం..రెస్క్యూ హోం ఉద్దేశం వేరు.
స్టేట్ హోం కి విదేశాలనుండి ఆర్ధిక సాయం చేసేవారు కూడా ఎక్కువే .
దయచేసి ఇక్కడ పిల్లలకి సరైన సౌకర్యాలు కల్పించండి,వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి వెళ్తామనే పిల్లలకి వెళ్ళే అవకాశం కల్పించండి..అంతేకాదు..రెస్క్యూ హోం ని ,అనాధాశ్రమాన్ని కలిపి ఒకచోట ఉంచకండి.
మీరు దొరికిన అమ్మాయిలిద్దరితోమాత్రమే మాట్లాడారు..అలా కాకుండా ఎప్పుడేనా సడెన్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులని తెలుసుకుంటే అనాధ పిల్లలకి మేలు చేసినవారవుతారు అంతేకాకుండా..అధికారులూ మరింత శ్రద్ధగా పనిచేస్తారు
బుధవారం స్టేట్ హోం నుండి 11 మంది అమ్మాయిలు తప్పించుకుని పారిపోయిన విషయం లో మీరు అధికారులని మందలించారు..బానే ఉంది కానీ అసలక్కడ ఏం జరుగుతోంది అనేది నాకు తెలిసినంతవరకు చెప్తాను.'స్టేట్ హోం లో అప్పుడే పుట్టిన పసిపిల్లల్ల దగ్గరనుండి 25 యేళ్ళ లోపు వాళ్లున్నారు .
అక్కడ పిల్లల్లో.. తల్లీతండ్రీలేనివాళ్ళే కాకుండా semi orphans అంటే పేరెంట్స్ లో ఎవరో ఒకరు ఉండీ పోషించలేని పరిస్థిలో ఉన్న పిల్లలు+అనాధాశ్రమం+రెస్క్యూ హోం కూడా ఉండటం తో కొద్దిగా పిల్లల మైండ్ సెట్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సహజం గా 10 యేళ్ళు దాటిన పిల్లలకి తల్లో, తండ్రో అప్పుడప్పుడూ వచ్చి కనపడుతుండటంతో ఇంటికెళిపోవాలనే కోరిక పెరగడం,వాళ్ళతోపాటు అసలు పేరెంట్స్ లేని పిల్లలు కూడా వాళ్ళ మధ్య ఉన్న స్నేహం తో వీళ్ళు వెళిపోవడం జరుగుతోంది.
ఇదికాకుండా అక్కడ నీళ్ళు పట్టుకోవడం దగ్గరనుండి చాలాపనులు వీళ్ళే చేసుకుంటూ ఉంటారు..ఇదే పని బయట చేసుకుని బతకలేమా అనే ఆలోచన కూడా వీళ్లకి ఉంది..అయితే వీళ్ళలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నవాళ్ళు ఉన్నారు..
ఒకమాట చెప్పండి నిజంగా ఈరోజుల్లో చదువుకునే పిల్లలకి వాళ్ళ చదువుతోపాటు ఇంటిపనులు చేసుకునే టైం ఉంటోందా ఇప్పుడున్న చదువులకి.
ఇక రెస్క్యూ హోం కూడా ఇక్కడే ఎందుకు ఉండటం..రెస్క్యూ హోం ఉద్దేశం వేరు.
స్టేట్ హోం కి విదేశాలనుండి ఆర్ధిక సాయం చేసేవారు కూడా ఎక్కువే .
దయచేసి ఇక్కడ పిల్లలకి సరైన సౌకర్యాలు కల్పించండి,వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి వెళ్తామనే పిల్లలకి వెళ్ళే అవకాశం కల్పించండి..అంతేకాదు..రెస్క్యూ హోం ని ,అనాధాశ్రమాన్ని కలిపి ఒకచోట ఉంచకండి.
మీరు దొరికిన అమ్మాయిలిద్దరితోమాత్రమే మాట్లాడారు..అలా కాకుండా ఎప్పుడేనా సడెన్ విజిట్ చేసి అక్కడ పరిస్థితులని తెలుసుకుంటే అనాధ పిల్లలకి మేలు చేసినవారవుతారు అంతేకాకుండా..అధికారులూ మరింత శ్రద్ధగా పనిచేస్తారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి