వేమూరి రాధాకృష్ణ గారూ మీకు కోపం KCR మీద,గవర్నర్ మీద..అంతేనా లేక గవర్నర్ గారి కులం మీద జంధ్యం వేసుకునే వాళ్లమీద కూడానా..
కంచె ఐలయ్యగారు మీకు కోపం KCR మీద, జంధ్యం వేసుకునేవాళ్ళమీదా...అంతేనా లేక గవర్నర్ మీద కూడానా
Transitive Property of Equality(A=B,B=C..then A=C) అనే సిద్ధాంతం ప్రకారం మీ ఇద్దరికీ రెండు పాయింట్ల మీద అభిప్రాయాలు కలిసాయి
అని తెలుస్తోంది..
ఇవాళ చాలా అద్భుతంగా కంచె ఐలయ్య అనే మహానుభావుడు గారు, శ్రీ శ్రీ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి పేపర్ ఐన ఆంధ్రజ్యోతి లో అసలు KCR అనే ఆయన కేవలం గవర్నర్ గుండెల మీద ఉన్న జంధ్యం చూసి మాత్రమే గవర్నర్ కాళ్ళకి దండం పెట్టినట్టు చక్కగా సమీక్ష రాసారు...తెల్లారిలేచి తెలంగాణా లో ఎంతమంది బ్రాహ్మల పాదాలకి KCR దండం పెట్టడం ఈ ఐలయ్య చూశారో మరి.. నాకయితే తెలీదు.
ఇక వేమూరి అయితే బ్రాహ్మలు అల్ప సంతోషులు..అందుకే KCR అలా చేసారు అని మొన్న స్టేట్ మెంట్ ఇచ్చేసారు..
వాళ్ళ సంతోషం గురించి మీకెందుకు రాధాకృష్ణగారు ..మీ ప్రాబ్లం KCR, గవర్నర్ కదా వాళ్ళ గురించి పట్టించుకోండి చాలు.
ఒకవేళ గవర్నర్ మారితే అప్పుడు కూడా KCR ముఖ్యమంత్రిగా ఉంటే..కంచె ఐలయ్య గారు ఆయన ధోరణిలోనే వేమూరి రాధాకృష్ణ గారికి ఇలాగే సమీక్ష రాస్తారా..లేక.. అప్పుడు ఇద్దరికీ పొత్తులుండవా..నన్ను వేధించే ప్రశ్న ఇది
ఒక మీడియా ప్రతినిధి మెప్పు పొందడానికి ఒక కులం మీద విషం కక్కే కంచె ఐలయ్యగారు, ఒక ముఖ్యమంత్రి మీద, ఒక గవర్నర్ మీద కోపం తో అదే కులాన్ని టార్గెట్ చేసే వేమూరి రాధాకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు.
మీరిద్దరూ ఇలాగే ముందుకుపొండి..


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి