2013 జూలై 1 వ తేదీ రామచంద్ర శాస్త్రి గారు పొద్దున్నే లక్ష్మీదేవిని స్మరించుకుంటూ లేచారు.కాలకృత్యాలు ముగించుకుని బయట వరండాలో పేపర్ చదవడం లో నిమగ్నమయ్యారు..వార్తల్లో కొత్తదనమేదీ కనపడలేదు ఆయనకు..ఓపక్కన టి వి లో ఏవన్నా తమకు సంబంధించిన వార్తలొస్తాయేమోనని ఓకన్ను,చెవీ కూడా అటువేపు వేసుంచారు.
శాస్త్రిగారిలాంటి ప్రభుత్వ విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేరోజది.ఆరోజునుండి ఎంతోకొంత పెన్షన్ పెరుగుతుందనే సంతోషం తెచ్చేరోజు కాబట్టి..రోజులు గడుస్తున్నాయి..ఇంతలో ఒక పెనుమార్పు..ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండు ముక్కలయ్యింది..ఈలోపల నిలద్రొక్కుకునే సమయం ఇవ్వకుండా తుఫానురూపంలో ప్రకృతి కూడా విలయతాండవం చేసింది..అలా ఒక సంవత్సరం గడిచింది.అలా జీతాలు,పెన్షన్లు సవరించే 5 సంవత్సరాల కాలంలో రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ యధావిధిగా కాలచక్రంలో ఇంకో సంవత్సరం మొదలయ్యింది..రోజూలాగానే ఆరోజూ శాస్త్రిగారు మధ్యాన్నం కాఫీ తాగుతూ గతాన్ని నేమరువేసుకుంటున్నారు.ఈలోపల శాస్త్రిగారి భార్య ఏవండీ! అంటూ ఆదుర్దాగా వచ్చింది.ఏవిటీ! ఏవయ్యింది అంత కంగారుగా పిలిచావ్ అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచి అడిగారు శాస్త్రిగారు.
ఇప్పుడే టీవీ లో చూసాను పక్క రాష్ట్రం లో మీలాంటివాళ్ళకి ఫిట్ మెంట్ పెరిగిందని వార్తల్లో చూపిస్తున్నారు అని శెలవిచ్చిందావిడ.
ఔనా!..నేను తెలుసుకుంటానులే అని ఊరుకున్నారు శాస్త్రిగారు
ఆ తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో తమకూ తమ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త విని చాలా సంతోషించారు శాస్త్రిగారు.
పూర్తి సమాచారం చేరేటప్పటికి టైం పట్టింది.ఈ లోపల ఉత్తర్వులు జారీ అయినప్పటినుండీ ప్రతీనెలా శాస్త్రిగారు పెన్షన్ పెరిగిందేమోనని చూసుకోవడం తో నెలలు గడుస్తున్నాయి..
ఎందుకిలా జరుగుతోంది ఇప్పటివరకూ ప్రభుత్వమేదయినా విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగుల పట్ల బాగానే వ్యవహరించేది..ఉత్తర్వులు లేటయినా..అందవలసిన సొమ్ము విషయంలో తప్పు పట్టేవిధంగా ప్రభుత్వ స్పందన ఉండేదికాదు..ప్రభుత్వం వ్యవహరించేదికాదు..ఇప్పుడెందుకిలా జరుగుతోంది.చాలామంది ప్రభుత్వేతరులు,ప్రజలు .. హైద్రాబాద్ నుండి రావల్సిన ఉద్యోగులు రావడం లేదుకాట్టి ఫిట్ మెంట్ పెంచడం కరెక్ట్ కాదు అంటున్నారు..కానీ కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే లభ్ది చేకూరదు అనేది ప్రభుత్వానికి,ప్రజలకు తెలుసు..పైగా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రిగారూ ఫిట్ మెంట్ ఇచ్చి మాటలు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులంటే హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళే కాదు కదా.ఇవాళ రాష్ట్రం విడిపోయాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉత్తర్వులు ఇవ్వడం..మీడియాకూడా హైలైట్ చెయ్యడం జరిగిందికానీ ఇవ్వాళే మొదటిసారి ఫిట్ మెంట్ ఇవ్వలేదే..ప్రతీ 5 ఏళ్ళకోసారి జరుగుతున్నదే..కేవలం ఒకప్రాంతం నుండి ఉద్యోగులు రాకపోవడానికి మిగిలిన మొత్తం ప్రాంతానికి లబ్ధి చేకూరకపోవడం అనేది సమంజసం గాలేదు...జీతాలు పెంచడం,బోనస్ ఇవ్వడం,ప్రోత్సహించడం అనేది ఏ సెక్టార్ లోనయినా జరుగుతున్నదే...జారీ చేసిన విషయాలన్నీ కాగితాలవరకే అనే విషయం తెలిసినప్పటినుండి బాధ పడటం తప్ప చెయ్యగలిగేది ఏముంది..అని నిటూర్చారు శాస్త్రిగారు.
My sincere Thanks to my Father R.Parameswara rao..Rtd Teacher....
శాస్త్రిగారిలాంటి ప్రభుత్వ విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులకి 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చేరోజది.ఆరోజునుండి ఎంతోకొంత పెన్షన్ పెరుగుతుందనే సంతోషం తెచ్చేరోజు కాబట్టి..రోజులు గడుస్తున్నాయి..ఇంతలో ఒక పెనుమార్పు..ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండు ముక్కలయ్యింది..ఈలోపల నిలద్రొక్కుకునే సమయం ఇవ్వకుండా తుఫానురూపంలో ప్రకృతి కూడా విలయతాండవం చేసింది..అలా ఒక సంవత్సరం గడిచింది.అలా జీతాలు,పెన్షన్లు సవరించే 5 సంవత్సరాల కాలంలో రెండేళ్ళు గడిచిపోయాయి.
మళ్ళీ యధావిధిగా కాలచక్రంలో ఇంకో సంవత్సరం మొదలయ్యింది..రోజూలాగానే ఆరోజూ శాస్త్రిగారు మధ్యాన్నం కాఫీ తాగుతూ గతాన్ని నేమరువేసుకుంటున్నారు.ఈలోపల శాస్త్రిగారి భార్య ఏవండీ! అంటూ ఆదుర్దాగా వచ్చింది.ఏవిటీ! ఏవయ్యింది అంత కంగారుగా పిలిచావ్ అంటూ హడావుడిగా కుర్చీలోంచి లేచి అడిగారు శాస్త్రిగారు.
ఇప్పుడే టీవీ లో చూసాను పక్క రాష్ట్రం లో మీలాంటివాళ్ళకి ఫిట్ మెంట్ పెరిగిందని వార్తల్లో చూపిస్తున్నారు అని శెలవిచ్చిందావిడ.
ఔనా!..నేను తెలుసుకుంటానులే అని ఊరుకున్నారు శాస్త్రిగారు
ఆ తర్వాత చాలా స్వల్ప వ్యవధిలో తమకూ తమ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు జారీ చేసిందనే వార్త విని చాలా సంతోషించారు శాస్త్రిగారు.
పూర్తి సమాచారం చేరేటప్పటికి టైం పట్టింది.ఈ లోపల ఉత్తర్వులు జారీ అయినప్పటినుండీ ప్రతీనెలా శాస్త్రిగారు పెన్షన్ పెరిగిందేమోనని చూసుకోవడం తో నెలలు గడుస్తున్నాయి..
ఎందుకిలా జరుగుతోంది ఇప్పటివరకూ ప్రభుత్వమేదయినా విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగుల పట్ల బాగానే వ్యవహరించేది..ఉత్తర్వులు లేటయినా..అందవలసిన సొమ్ము విషయంలో తప్పు పట్టేవిధంగా ప్రభుత్వ స్పందన ఉండేదికాదు..ప్రభుత్వం వ్యవహరించేదికాదు..ఇప్పుడెందుకిలా జరుగుతోంది.చాలామంది ప్రభుత్వేతరులు,ప్రజలు .. హైద్రాబాద్ నుండి రావల్సిన ఉద్యోగులు రావడం లేదుకాట్టి ఫిట్ మెంట్ పెంచడం కరెక్ట్ కాదు అంటున్నారు..కానీ కేవలం ఆ ఉద్యోగులకు మాత్రమే లభ్ది చేకూరదు అనేది ప్రభుత్వానికి,ప్రజలకు తెలుసు..పైగా మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రిగారూ ఫిట్ మెంట్ ఇచ్చి మాటలు పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు..విశ్రాంత,అవిశ్రాంత ఉద్యోగులంటే హైద్రాబాద్ లో ఉన్నవాళ్ళే కాదు కదా.ఇవాళ రాష్ట్రం విడిపోయాకా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఉత్తర్వులు ఇవ్వడం..మీడియాకూడా హైలైట్ చెయ్యడం జరిగిందికానీ ఇవ్వాళే మొదటిసారి ఫిట్ మెంట్ ఇవ్వలేదే..ప్రతీ 5 ఏళ్ళకోసారి జరుగుతున్నదే..కేవలం ఒకప్రాంతం నుండి ఉద్యోగులు రాకపోవడానికి మిగిలిన మొత్తం ప్రాంతానికి లబ్ధి చేకూరకపోవడం అనేది సమంజసం గాలేదు...జీతాలు పెంచడం,బోనస్ ఇవ్వడం,ప్రోత్సహించడం అనేది ఏ సెక్టార్ లోనయినా జరుగుతున్నదే...జారీ చేసిన విషయాలన్నీ కాగితాలవరకే అనే విషయం తెలిసినప్పటినుండి బాధ పడటం తప్ప చెయ్యగలిగేది ఏముంది..అని నిటూర్చారు శాస్త్రిగారు.
My sincere Thanks to my Father R.Parameswara rao..Rtd Teacher....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి