...అంటే ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంటే, ఇప్పటివరకూ గాల్లో కలిసిపోయిన చాలామంది రైతుల ప్రాణాలతోపాటే ఇతని ప్ర్రాణం ఉండేది..ఈ పార్టీలు యుద్ధప్రాతిపదికన అతని కుటుంబానికి లక్షలు ప్రకటించేవారూ కాదు..
అంచేత ఒక రకంగా అతని కుటుంబానికి చచ్చాకా ఆధారం అయ్యాడతను..ఈ పార్టీలన్నిటికి అతను చనిపోయాడు అనే బాధకంటే ఢిల్లీ లో చనిపోవడమే ఎక్కువ బాధగా ఉన్నట్టుంది.
కానీ ఒక్క విషయం..
ఒక రాజస్థాన్ కి చెందిన వ్యక్తి,అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన వాడు..(ఇక్కడ అతనొక్కడేకాదు)..తనలాంటి బాధితులతోకలిసి వసుంధరా రాజే మీద వత్తిడి అయినా తీసుకురావల్సింది, ఎందుకంటే ఊహించని కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని కాక ఇంకెవర్ని సాయం అడుగుతారు ప్రజలు. ఒకవేళ వాళ్ళు సాయం పొందలేకపోతే వేరే ఏదయినా బ్రతుకుదెరువు అయినా చూసుకోవాల్సింది..ఆ బాధ అనుభవించినవాళ్ళకి తెలుస్తుందనేవాళ్లకు నేనేం చెప్పలేను...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి