నిద్రపోతున్న తన చిన్న ప్రపంచాన్ని తట్టి లేపిన సోనియాగాంధీ..ఎంతో బాధతో లేఖరాసిన విధానం చూస్తుంటే...చాలా సంతోషంగా ఉంది.
మన విజయనగరం సత్తిపండు ,గ్లామర్ కింగ్ ఆనం రాం నారాయణరెడ్డి ,అభిమాన
స్నేహితుడు కే వీ పీ ..ఈ ముగ్గురూ తో కలిసి కేంద్రం తో ..ఏపీ కీ ప్రత్యేక
హోదా,రెవెన్యూ లోటు,రాజధానీ లాంటీ అంశాల గురించి రాజీ లేని పోరాటానికి
డిసైడ్ అయ్యారు సోనియా గారు..
ఒక పార్టీని బతికించుకోవాలీ అంటే.. ఒక
సమస్యను, అది తను సృష్టించిందే అయినా కూడా అవసరానికి ఈజీగా వాడుకోవచ్చనే
విషయం బాగా తెలుసుకున్నారు..
ఏపీ
రాష్ట్రానికి సంబంధించినంతవరకూ మీరు ఏహోదాలో అడుగుతున్నారు..మీరేం అక్కడ
ప్రతిపక్షం కాదు.ఐతేనేం మేము మనుషులం మాకా హక్కుంది అంటారా..మీకంటే అక్కడి
ప్రజలే బాగా అడుగుతున్నారు...
ఇక కేద్రం దగ్గరకొస్తే ..ఆల్రెడీ కేంద్రం
జారీ చేస్తున్న ఆర్డినెన్సుల మీద ఫైట్ చేస్తున్నారు కదా..దానితోపాటు
ఈవిషయం కూడా ప్రస్తావిస్తున్నారా..
నేను గిల్లాను..మీరంతా జోలపాడండి అంటే ..ఎలా.
ఓపక్కన ,మీ పొన్నాల లక్ష్మయ్యగారూ తెలంగాణా బిల్ అమోదం పొంది
సంవత్సరమయ్యిందీ ఇదంతా మా సోనియా ఘనత అని సంబరాలు చేసుకుంటున్నారు..మరోపక్క
మీరు పోరాటం చేస్తానంటున్నారు..
బావుందండీ ..ఏరాష్ట్రానికి ఆ రాష్ట్రం లో అలా అన్నీ సెట్ చేసుకుంటున్నారన్నమాట.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి