సిన్సియర్ గా ఉండే ఆఫీసర్స్ కి నాదొక చిన్న మనవి..
మీ మనస్సాక్షికి
సమాధానం చెప్పుకోవడానికో,మీ నిజాయితీ ని నిలబెట్టుకోవడం కోసమో..సమాజం పట్ల
మీకున్న భాద్యతని తెలియచెయ్యడం కోసమో, తీసుకునే జీతానికి న్యాయం చెయ్యడం
కోసమో, మీ ప్రాణాలని సైతం లెక్కచెయ్యకుండా పోరాడకండి..ఎందుకంటే మేము అంటే
ప్రజలు..మీకేదయినా కష్టం వచ్చి, మీరంతట మీరే ప్రాణం తీసుకున్నా,వేరేవిధంగా
ప్రాణం పోయినా కూడ కొద్ది రోజుల్లో మర్చి,పోతాం..
ప్రతీ సంవత్సరం ఆరోజుని, గుర్తుచేసుకుని మీ బొమ్మకి దండేస్తాం అంతే...లేదంటే కనిపించే దేవుళ్ళు అని ఓ ముక్క అంటాం అంతే..
అంతేగానీ పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళనుండి విముక్తి తప్ప అనుకోవద్దు..సంకెళ్ళ మాట దేవుడెరుగు..మీరే పోయేటట్టున్నారు...
నేనీమాట మామూలుగా రాయడం లేదు..2011 లో మహారాష్ట్ర లో యస్వంత్ అనే అడిషనల్
డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని సజీవదహనం చేసేసారు..ఎందుకంటే అక్రమంగా నిల్వ
ఉంచిన కిరోసిన్,పెట్రోల్ ని బయటకు తీసారని ...ఇతనికి 42 యేళ్ళే.
మధ్యప్రదేశ్ లో అయితే గనుల అక్రమరవాణా చేస్తున్నవాళ్లని అడ్డుకున్నందుకు గాను ట్రాక్టర్స్ తో తొక్కించి చంపేసారు ఒక IPS ఆఫీసర్ని.
బీహార్ లో, ఒక రాజకీయనాయకుడు 1994 లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన బీహార్ కేడర్ IAS ఆఫీసర్ కృష్ణయ్య ని కాల్చి మరీ చంపించారు.
ఇవి నాకు గుర్తున్నవి మాత్రమే...వెలుగులోకి రానివి ఎన్నో తెలీదు.
పెద్ద స్థాయి అధికారుల పరిస్థితి ఇలా ఉంటే నిజాయితీగా ఉండే చిన్న స్థాయి వాళ్ళ గురించి ఏం చెప్పాలి.
హంసలా బతకండీ..కాకిలా కలకాలం కాదు అనే చచ్చుపుచ్చు మాటలన్నా అవి వినద్దు...
మీరు ఏపోరాటం చేసినా పూర్తిగా ప్రజల మద్దతు తో చెయ్యండి,ప్రజల రక్షణ
కూడగట్టుకోండి..మీకోసం ప్రజలు తిరగబడేలా చెయ్యండి...లేదంటే..మీరు జీతం
తీసుకుంటున్నారు..జీతానికి తగ్గ పనిచేసుకుని హేపీగా ఇంటికెళ్ళి..రోజువారీ
జీవితం జీవించండి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి