నాకో చిన్న సందేహం...
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పంచవర్షప్రణాళికల స్థానం లో వార్షిక ప్రణాళికలుంటే,అన్ని విధాలా బావుంటుందని..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని పిలిచి ప్రకటించారు..దీనికి అందరూ కూడా ఒప్పుకున్నారు..కాంగ్రెస్ తప్ప
అంటే కొన్ని నిర్ణయాలకి అందరి ఆమోదం అవసరం అనేది స్పష్టమయ్యింది..అయితే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే ..పంచవర్షప్రణాళికలు కాంగ్రెస్ చేతిలో రూపుదిద్దుకున్నాయి 60 యేళ్ళ క్రితం..ఇప్పటివరకూ కంటిన్యూ అవుతూ వచ్చినప్పుడు ఇప్పుడెందుకు మార్చడం అని కావచ్చు.
కానీ పంచవర్ష ప్రణాళికలో స్థానం లో వార్షికప్రణాళికలు మాత్రమే ఉండాలి అనే నిర్ణయానికి అందరి అమోదం పొందడం లో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
మరీ ఇదే రీతిలో కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రానికి కూడా కొన్ని ప్రత్యేక నిధులు,అనుమతులు,రాయతీలు ఇవ్వడానికి కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించచ్చుగా...
ఎలాగూ రెండు రాష్ట్రాలుగా విడదీసిన కాంగ్రెస్ కూడా ప్రత్యేక రాష్ట్రం గా ప్రకటించాలని కూడా అడుగుతోంది కాబట్టి..ఈ ప్రపోజల్స్ కి అడ్డురాదు కదా...ఎందుకంటే ఒకవేళ అడ్డొస్తే ఏం జరుగుతుందో కాంగ్రెస్ కు తెలుసు..
కొన్నిటికి రూల్స్ ఒప్పుకోవు అని చెప్పి రూల్స్ మార్చేకంటే కొత్త రూల్ ఒకటి తయారుచేసి ఆ రూల్స్ కి కలిపేస్తే సరి..మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇలా చెయ్యడం తప్పుకాదని నా ఉద్దేశం...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి