వామనావతారం గుర్తుంది కదా అందరికీ...
వామనుడు పుట్టినవెంటనే తండ్రిని ఉపనయనం చెయ్యమంటాడు...తన తండ్రి అయిన కశ్యపబ్రహ్మని..
తండ్రికి తెలుస్తుంది, తనకి పుట్టింది శ్రీమహావిష్ణువే నని ..వెంటనే ఒడుగు చేస్తాడు కూడా..
బుల్లి పిల్లాడులా ఉండే వామనుడు..హేపీగా యజ్ఞోపవీతం ధరించి..ఒక గొడుగు
తీసుకుని బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న స్థలం దగ్గరకొస్తాడు..మన
బలిచక్రవర్తి కాస్తా ..కొత్తగా ఉపనయనం అయినట్టుంది ఏంకావాలో కోరుకో
అంటాడు...
వామనుడు మూడడుగుల స్థలం చాలు అంటాడు..అంతేనా అంటాడు బలి..అంతే చాలూ..కానీ నేనే కొలుచుకుంటాను అంటాడు వామనుడు..
మహాభాగ్యం అని చెప్పి , బలిచక్రవర్తి ,భార్యని నీళ్ళు తీసుకురమ్మంటాడు
అయితే... అతని భార్య నీళ్ళు తెచ్చి బలి చేతిలో వంపుతుండగా... మన
శుక్రాచార్యుడు ఉన్నాడు కదా, మహా తెలివైనవాడు..వచ్చింది విష్ణుమూర్తి అని
కనిపెట్టి..నీళ్ళు పడే రంధ్రానికి అడ్డుగా వెళతాడు..
నీరు రాకపోవడాన్ని
గ్రహించిన వామనుడు ధర్బ పుల్లతో ఒకసారి పొడుస్తాడు. దెబ్బకి
శుక్రాచార్యుడి కన్ను పోతుంది ...సంతోషంగా దానం చేస్తాడు బలి చక్రవర్తి..అ
తర్వాత అంతా మీకు తెలుసు..చాలా చిన్నప్పుడు చదివాను..అందుకే
గుర్తున్నంతవరకూ రాసాను.
...ఇప్పుడు రాజులు,రాజ్యాలు..లేవు
.శుక్రాచార్యులు ఉన్నా..వాళ్ళ ఆటలు సాగవు..ఈ రోజుల్లొ దానాలివ్వడం
..పుచ్చుకోవడం...అనేవి విలువలేని మాటలు..
ఇప్పుడు ప్రజాస్వామ్యం లో
ఉన్నాం...ప్రజలదగ్గర ఓటు అనే అయుధం ఉంది. రోజులు మారాయి...ఒక పార్టీకి
నలభయ్యేళ్ళు పట్టింది కళ్ళు తెరవడానికి...కానీ ఉపయోగం లేదు కదా..మిగిలిన
పార్టీలు నేర్చుకుంటే మంచిది..లేదంటే ఉన్న ఖర్చులతోపాటు మళ్ళీ ఎలెక్షన్స్
ఖర్చు....మళ్ళీ పన్నులు..ధరలు పెరగడం అనీ మామూలే ...
అలవాటు పడిపోయాం అని అనుకోవద్దు..ఒకవామనుడినే తట్టుకోవడం కష్టం అయ్యింది...ఇప్పుడు ప్రజలందరూ వామనుడిలా అయ్యేదాకా వెయిట్ చెయ్యకండి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి